అవినీతి, మన ప్రజల రోజువారీ జీవితాల్లో అది కూడా భాగమైపోయింది. మరీ పుస్తకంలో రాసింది రాసినట్లు ప్రతిదానిని అనుసరించడానికి ఎవరికీ సాధ్యం కావడం లేదు. సామాన్యుడికి సమయం లేదు, అధికారుల ఆశకి అంతు లేదు. ఈ రెండింటిని తృప్తి పరిచేది ఒక్క అవినీతి మాత్రమే. అన్ని సక్రమంగా ఉన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో ప్రయాస పడి అన్ని సక్రమంగా చేయాలేనే భావన సగటు సామాన్యుడిలో కూడా ఉంది.
పోనీ అవినీతిని ఎదిరించి పని చేసుకుందామంటే పని జరగదు. ఫిర్యాదు చేసినా సత్వరంగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. వీటన్నింటి వలన అవినీతి అనేది అన్ని చోట్లా పెరిగిపోతుంది. ఒకరిద్దరు నీతిగా పనిచేస్తున్నా ఆ ఒకరిద్దరంటే మిగిలిన అధికారులకి భయం పెరిగిపోయి, మిగిలిన వారందరూ వారికి వ్యతిరేకం అయిపోయి పని చేయడం కష్టతరం చేసేస్తారు. ఇలా కష్టాలు ఎదురైనప్పుడు తమ ముందుండేవి రెండే దారులు. ఒకటి తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయలేక ఉద్యోగం మానేయడం, లేదా నచ్చకపోయినా సిద్ధాంతాలను పక్కనబెట్టి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం. మొదటిది అందరూ చేయలేరు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది. ఈ ఉద్యోగం మానేసి వారిని భాదపెట్టలేక, నమ్మిన సిధ్ధాంతాలకు న్యాయం చేయలేక ఎంతో మంది మారిపోతున్నారు. ఇలాంటి వారు అవకాశం వస్తే తప్ప అవినీతి చేయరు. ఎందుకంటే వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అని నా అభిప్రాయం.
వీటన్నింటికి నాకు తెలిసినంతవరకు ఒకటే పరిష్కారం. అవినీతిని ఎదిరంచి నిలబడిన వారికి తోడుగా నిలబడేంతలా సమాజం పురోగతి చెందాలి. అలా జరగాలంటే ప్రభుత్వాలు అవినీతిపై పోరాటం చేసేవారికి అండగా నిలబడతాం అనే ధైర్యం కలిగించాలి. ఇటువంటి కేసుల్లో విచారణ శిక్ష త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి చేయాలనుకునే అధికారుల్లో అవినీతిని ప్రోత్సహించే ప్రజలలో భయం పెరగాలి. మంచి మాటలు విని మారిపోయే స్థితిని మనమెప్పుడో దాటిపోయాం అనేది నా అభిప్రాయం.
ఈ అవినీతి కొంతమంది రాజకీయనాయకులకి చాలా అవసరం. ఎందుకంటే వీరి జేబులు నిండేది ఇలా అవినీతి జరిగినప్పుడే. అందుకే మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఎలాగైన ప్రజల దృష్టిలో వచ్చిన వారు కూడా అందరూ లాంటి వారే అనే అబద్దపు భావన కలిగేలా చేస్తారు. కొత్తగా వచ్చిన వాడి దగ్గర గుండు కొట్టించుకోవడం కంటే మనకి తెలిసిన వాడు, ఎప్పటినుంచో వున్న వాడైతే మనకు మంచిదని ప్రజలు కూడా ఆలోచించి వారికే ఓట్లేసి అందలమెక్కిస్తున్నారు, అవినీతిలో బ్రతికేస్తున్నారు.
అలా అవినీతిలో అందరిలాగే బ్రతికేస్తున్నాము అనుకుంటున్నారు కానీ, ఈ సమాజంలో కొందరు ఎదిగినట్లు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నారు. కానీ దానికి కారణం తామే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఇది నిజం..!! బద్దకాన్ని మన నరనరాల్లో నింపేసి వారి ఉచిత పథకాలకి మనల్ని బానిసలుగా చేసుకొని వారు రాజ్యాలనేలుతున్నారు, మనం మాత్రం వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అని కలలు కంటూ బ్రతికేస్తున్నాం.
అందరికీ అన్ని కావాలి, కానీ వాటి కోసం కష్టపడడానికి మాత్రం బద్ధకం. అందరికి కష్టపడి పైకి ఎదగడానికి సమానంగా అవకాశాలు ఉండాలి. వారు పడిన కష్టాన్ని బట్టి వారికి ఫలితాలు ఉండాలి. అప్పుడే అది సమసమాజం అవుతుందని నా అభిప్రాయం..!!
పైన వున్నవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే..!!
పోనీ అవినీతిని ఎదిరించి పని చేసుకుందామంటే పని జరగదు. ఫిర్యాదు చేసినా సత్వరంగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. వీటన్నింటి వలన అవినీతి అనేది అన్ని చోట్లా పెరిగిపోతుంది. ఒకరిద్దరు నీతిగా పనిచేస్తున్నా ఆ ఒకరిద్దరంటే మిగిలిన అధికారులకి భయం పెరిగిపోయి, మిగిలిన వారందరూ వారికి వ్యతిరేకం అయిపోయి పని చేయడం కష్టతరం చేసేస్తారు. ఇలా కష్టాలు ఎదురైనప్పుడు తమ ముందుండేవి రెండే దారులు. ఒకటి తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయలేక ఉద్యోగం మానేయడం, లేదా నచ్చకపోయినా సిద్ధాంతాలను పక్కనబెట్టి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం. మొదటిది అందరూ చేయలేరు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది. ఈ ఉద్యోగం మానేసి వారిని భాదపెట్టలేక, నమ్మిన సిధ్ధాంతాలకు న్యాయం చేయలేక ఎంతో మంది మారిపోతున్నారు. ఇలాంటి వారు అవకాశం వస్తే తప్ప అవినీతి చేయరు. ఎందుకంటే వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అని నా అభిప్రాయం.
వీటన్నింటికి నాకు తెలిసినంతవరకు ఒకటే పరిష్కారం. అవినీతిని ఎదిరంచి నిలబడిన వారికి తోడుగా నిలబడేంతలా సమాజం పురోగతి చెందాలి. అలా జరగాలంటే ప్రభుత్వాలు అవినీతిపై పోరాటం చేసేవారికి అండగా నిలబడతాం అనే ధైర్యం కలిగించాలి. ఇటువంటి కేసుల్లో విచారణ శిక్ష త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి చేయాలనుకునే అధికారుల్లో అవినీతిని ప్రోత్సహించే ప్రజలలో భయం పెరగాలి. మంచి మాటలు విని మారిపోయే స్థితిని మనమెప్పుడో దాటిపోయాం అనేది నా అభిప్రాయం.
ఈ అవినీతి కొంతమంది రాజకీయనాయకులకి చాలా అవసరం. ఎందుకంటే వీరి జేబులు నిండేది ఇలా అవినీతి జరిగినప్పుడే. అందుకే మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఎలాగైన ప్రజల దృష్టిలో వచ్చిన వారు కూడా అందరూ లాంటి వారే అనే అబద్దపు భావన కలిగేలా చేస్తారు. కొత్తగా వచ్చిన వాడి దగ్గర గుండు కొట్టించుకోవడం కంటే మనకి తెలిసిన వాడు, ఎప్పటినుంచో వున్న వాడైతే మనకు మంచిదని ప్రజలు కూడా ఆలోచించి వారికే ఓట్లేసి అందలమెక్కిస్తున్నారు, అవినీతిలో బ్రతికేస్తున్నారు.
అలా అవినీతిలో అందరిలాగే బ్రతికేస్తున్నాము అనుకుంటున్నారు కానీ, ఈ సమాజంలో కొందరు ఎదిగినట్లు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నారు. కానీ దానికి కారణం తామే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఇది నిజం..!! బద్దకాన్ని మన నరనరాల్లో నింపేసి వారి ఉచిత పథకాలకి మనల్ని బానిసలుగా చేసుకొని వారు రాజ్యాలనేలుతున్నారు, మనం మాత్రం వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అని కలలు కంటూ బ్రతికేస్తున్నాం.
అందరికీ అన్ని కావాలి, కానీ వాటి కోసం కష్టపడడానికి మాత్రం బద్ధకం. అందరికి కష్టపడి పైకి ఎదగడానికి సమానంగా అవకాశాలు ఉండాలి. వారు పడిన కష్టాన్ని బట్టి వారికి ఫలితాలు ఉండాలి. అప్పుడే అది సమసమాజం అవుతుందని నా అభిప్రాయం..!!
పైన వున్నవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే..!!
Baundi correct has Chepparu .
ReplyDelete